దళిత జాతి ముద్దు బిడ్డ డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
సమ సమాజ నిర్మాణానికి అవిశ్రాంతంగా పోరాటం చేసిన నాయకుడు
మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్
మీ న్యూస్ ప్రతినిధి::జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలంలోని చింతలగట్టు చౌరస్తా వద్ద మహనీయుడు డా.బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్ .అనంతరం వారు మాట్లాడుతూ,భారత దేశ పార్లమెంట్ చరిత్రలోనే అత్యధిక కాలం పార్లమెంటేరియన్ గా పని చేసిన ప్రజా హృదయభ్రాత బాబు జగ్జీవన్ రామ్ అని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కోహిర్ మండల పార్టీ అధ్యక్షులు రామలింగారెడ్డి , మాజీ ఎంపీటీసీ మల్లన్న పాటిల్ , హుగ్గేలి రాములు ఎయంసి డైరెక్టర్ అశోక్ ఎస్సి సెల్ అధ్యక్షులు అనిల్ ,INTUC (F) రాజ్ కుమార్ మరియు మండల కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ , అశోక్ , ముర్జల్ ,జగదీష్ స్వామి గారు, మునీర్ , ఆశ్రఫ్ గారు, ఇక్బాల్ , తతిధర నాయకులు పాల్గొన్నారు.