మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ఆర్ సి గౌడ్
మీ న్యూస్ ప్రతినిధి:- తాండూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన వాగ్మోడే సుమన్ ప్రమాదవశాత్తు రైల్వే ప్రమాదంలో మృతిచెందినారు ఇట్టి విషయాన్ని తెలుసుకున్న తాండూర్ మండల బీ.ఆర్.ఎస్ పార్టీ బీ.సి సెల్ అధ్యక్షుడు ఆర్.సి గౌడ్ తాండూర్ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని పోస్తమత్రం తరువాత వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సుమన్ అంత్యక్రియలకు ఆర్థిక సహాయంగా 5000/- రూపాయలు అందించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మల్కాపూర్ గ్రామ ఘనికార్మికా సంఘం అధ్యక్షుడు ఎస్.పండరి గ్రామ పెద్దలు యువ నాయకులు మరియు ఆర్.సీ గౌడ్ యువసేన సభ్యులు పాల్గొనడం జరిగింది.