28 క్వింటాల పిడిఎస్ బియ్యం పట్టివేత..

Uncategorized క్రైమ్ సూర్యాపేట

28 క్వింటాల పిడిఎస్ బియ్యం పట్టివేత

 

కోళ్ల ఫారం పక్కన ఉన్న షెడ్డు లో పిడిఎస్ బియ్యం పట్టివేత

64 ప్లాస్టిక్ బస్తాలలో పిడిఎస్ బియ్యం 

స్థానిక మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ 

 

మీ: న్యూస్ సూర్య పేట్ జిల్లా ఇంచార్జీ కోల రవీందర్ గౌడ్ 

సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని వెంకటరాంపురం గ్రామ శివారులోని కోళ్ల ఫారం పక్కన ఉన్న షెడ్డు నందు తెల్లవారుజామున పిడిఎస్ బియ్యం మూటలు డ్రంప్ చేసి ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్సై ప్రవీణ్ కుమార్ తన్న సిబ్బంది కలిసి అక్కడ వెళ్లి తనిఖీ చేయగా 64 ప్లాస్టిక్ బస్తాలలో పిడిఎస్ బియ్యం నీ పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు, ఇట్టి పీడీఎస్ బియ్యాన్ని మండల పరిధిలోని నేలమర్రి గ్రామానికి చెందిన గుడిపూడి నగేష్ తండ్రి అబ్బులు అనే వ్యక్తి చుట్టుపక్క గ్రామాలలోని అమాయక ప్రజల నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి వేరే ప్రాంతానికి తరలించి అధిక ధరలకు విక్రయించి వ్యాపారం చేస్తున్నట్లు తమకు తెలియ వచ్చిందని ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.