మీ న్యూస్ ప్రతినిధి::మోతే మే 2 : సూర్యాపేట జిల్లా మోతే మండలంలోని సిరికొండ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామీ వారి దేవాలయం గ్రామంలో శుక్రవారం రామానుజాచార్యులు జయంతిని పురస్కరించుకొని అర్చకులు నరసింహ చార్యులు ఆధ్వర్యములో తనయ విన్నపం, అష్టోత్తరం,మంగళ శాసనం చేయడం జరిగినది తెలిపారు.ఇట్టి కార్య క్రమంలో వేంకటేశ్వర శరణాగతి సభ్యులు యాట వెంకన్న,బొంత నవీన్, దుగుంట్ల సైదులు,మమత, అంజమ్మ తదితర భక్తులు పాల్గొన్నారు.