కోహిర్ మండల నూతన విద్యాధికారిగా జాకీర్ హుస్సేన్ బాధ్యతలు స్వీకారణ 

Uncategorized జహీరాబాద్ తెలంగాణ సంగారెడ్డి

కోహిర్ మండల నూతన విద్యాధికారిగా జాకీర్ హుస్సేన్ బాధ్యతలు స్వీకారణ 

సంగారెడ్డి…. మీ న్యూస్….కోహీర్ మండల నూతన విద్యాధికారీగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల – దిగ్వాల్ ప్రధానోపాధ్యాయులు జాకీర్ హుస్సేన్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసినటువంటి శంకర్ సదశివపేట్ మండల విద్యాధికారిగా కొనసాగిస్తారు. పై అధికారుల ఆదేశానుసారం జాకీర్ హుస్సేన్ కోహిరు మండల విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించి విద్యాభివృద్ధికై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వనరుల కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది భాను స్వరాజ్ కుమార్, నర్సమ్మ మరియు సీఆర్పీలు యాదయ్య, మోహన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. నూతన మండల విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించినటువంటి జాకీర్ హుస్సేన్ పాఠశాలల ప్రధానో పాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రశస్థి అప్లికేషన్  వివరంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ సురేష్, ఐ ఈ ఆర్ పి షాహబుద్దీన్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.