ఏకగ్రీవంగ PRTU TS కోహీర్ మండల కమిటీ అధ్యక్షులు గ తిరుమలేష్ ఎన్నిక
మీ:: న్యూస్ ప్రతినిధి సంగారెడ్డి..మండల కేంద్రమైన కోహీర్ లొ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు సురేందర్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహిoచారు ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులు భోజరాజ్, ప్రధాన కార్యదర్శి అమర్నాథ్ రెడ్డి, PRTU TS కోహీర్ మండలం అధ్యక్షులుగా జె. తిరుమలేష్ ప్రధాన కార్యదర్శి శ్రీధర్నాథ్ అసోసియేటెడ్ అధ్యక్షులు శ్రీనివాస్ బడంపేట్ కమిటీ సభ్యులు శ్రీనివాస్ దిగ్వాల్, జైపాల్, ప్రశాంతి కుమారి, ఉమారాణి, పుష్పమ్మ వినోద ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు A. మణయ్య జిల్లా అధ్యక్షులు A. ప్రభు ఎన్నికల పర్యవేక్షకులుగా శ్రీశైలం , రత్నయ్య గౌరవ అతిథులుగా వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ప్రధానోపాధ్యాయులు, సంఘంలోని మండల ఉపాధ్యాయులు మరియు PRTU TS సంఘం అభిమానులు పాల్గొనడం జరిగింది. నూతన అధ్యక్షులు తిరుమలేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార సాధనలో ముందు ఉంటానని సభాముఖంగా తెలియజేయడం జరిగింది.ఏకగ్రీవంగ ఎన్నీ కైనా వారికీ కృతజ్ఞతలు తెలియజేసారు