మీ న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 22::ఖసింపేట్ గ్రామానికి చెందిన పందుల జానకి రాములు తండ్రి సైదులు 50 గౌడ్ అతను మద్ది శ్రీనివాస్ పొలం కు శ్రీనివాస్,లింగయ్య లతో కలసి వారి పొలానికి మందు కొట్టడానికి వెళ్లి మందు కొట్టుచుండగా అప్పట్టికే కరెంటు వైరు తెగి పొలం యందు పడి ఉన్నది చూడకుండా దాన్ని తొక్కటం వలన జానకి రాములు కు షాకు వచ్చి అక్కడిక్కడే చనిపోగా కాపాడబోయిన మద్ది.శ్రీనివాస్ కు గాయాలు అయినావని కరెంట్ వైరు తెగి పడటం లో నిర్లక్ష్యం వహించిన లైన్ మెన్ మరియు ఏఈ లపై చర్య గురించి కొడుకు శివ ఫిర్యాదు మేరకు కనకరత్నం ఎస్ ఐ కేసు నమోదు చేసారు..