సూర్యాపేట జిల్లా ఇంచార్జ్ కోల రవీందర్ గౌడ్ ప్రపంచ పర్యాటక దినోత్సవం వేడుకలసందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం పర్యాటక ప్రదేశాల పైన తుంగతుర్తి నందు మండల స్థాయిలో వ్యాసరచన మరియు చిత్రలేఖనం పోటీలను స్థానిక జూనియర్ కళాశాలల విద్యార్థినీ విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కళాశాల తుంగతుర్తి యందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మరియు టూరిజం క్లబ్ చైర్మన్ ఎ. రాజ మోహన రావు , కన్వీనర్ పి. నాగేశ్వరరావు NSS ప్రోగ్రాం అధికారులు పి పుల్లయ్య, పి. గణేష్ మరియు వివిధ కళాశాలల అధ్యాపకులు మధుకర్ , నాగయ్య ,రాంబాబు , ప్రదీప్ ,అనిత ,దయాకర్, సంతోష్, సోని ప్రియ,రమాదేవి, సలీం,సంతోషి మరియు అధ్యపకేతరులు భిక్షం ,లైక్, భూమన్నలు పాల్గొన్నారు