మీ న్యూస్ ప్రతినిధి:::మోతె:జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా సిరికొండ గ్రామానికి చెందిన సుష్మ ఉత్తమ బి ఎల్ వో గా ఎంపికైనట్లు శనివారం అధికారులు తెలిపారు. కలెక్టర్ ఉత్తమ బి ఎల్ వో గా లక్కపాక సుష్మ కు అవార్డుతోపాటు ప్రశంసా పత్రం అందజేశారు. ఈమె లాల్ తండ గ్రామపంచాయతీలో ఆశ వర్కర్ గా పనిచేస్తూ, బి ఎల్ వో గా విధులు నిర్వహించింది. ఉత్తమ బి ఎల్ వో గా ఎంపిక చేసినందుకు అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.