రైతుల కమిటీ కార్యాచరణ కోరకు రైతులకు ఆహ్వానం ఈ రోజు జరిగిన రైతుల సమావేశంలో,”రైతుల కమిటీ” కోసం కార్యాచరణ రూపొందించడము జరిగింది.వచ్చే నెల తేదీ 05-10-24 శనివారం నాడు ప్రతి గ్రామం నుండి కమిటీలో ఉండటానికి ఆసక్తిగల రైతులు మరియు తమ స్వశక్తితో కమిటీని ముందుకు నడుపగల రైతులు హాజరు అయినచో అందరి సమక్షంలో నూతన కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు, పి వి ఆర్ గార్డెన్స్ లో ఉదయం గం10:00కు జరిగే జహీరాబాద్ తాలూకా సమావేశంలో అందరు హాజరు కాగలరని మనవి.