బషీరాబాద్ మీ న్యూస్ ప్రతినిధి::: బషీరాబాద్ మండలంలోని ఎక్మాయి గ్రామంలో బషీరాబాద్ మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు నర్సింలు ఆధ్వర్యంలో నూతన ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఏక్మాయి గ్రామ ఎమ్మార్పీఎస్ అధ్యక్షునిగా శామప్ప, ఉపాధ్యక్షుడిగా శంకర్, రాములు ప్రధాన కార్యదర్శిగా కాశీనాథ్, కార్యదర్శిగా మహేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విజయవంతం చేయడంలో తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా ఈనెల 7 తేదీన జరిగే లక్ష డప్పులు వేయి గొంతుకల సభను జయప్రదం చేస్తామని అన్నారు.