మీ:: న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ మోతె: మండల కేంద్రంలోని శ్రీ శక్తి భవన్ లో మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చివ్వెంల మోతె మండల క్లస్టర్లకు సంబంధించిన వివిధ గ్రామాలకు చెందిన గ్రామ మంచినీటి సహాయకులకు శిక్షణ తరగతులను నిర్వహించారు. శిక్షణ తరగతుల్లో భాగంగా మొదటి రోజు పైప్ లైన్ లీకేజీ, పైపులైన్ అనుసంధానించడం గురించి అవగాహన కల్పించారు . ఈ కార్యక్రమంలో ఎస్ ఇ వెంకటేశ్వర్లు, డిఇ పాండు ఏ ఈ మణికంఠ ,ఈఈ అరుణాకర్ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు