కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్ పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి
calendar_today
December 7, 2024
person
meenewstelugu
కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్ పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి
మోతే మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 7 :: మోతె మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో వివిధ వసతులను పరిశీలించిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి విద్యార్థులకు మంచి పోషిక ఆహారం అందిస్తూ మంచి విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు కృషి చేయాలనీ స్కూల్ ఇంచార్జీ గారికి, మరియు ఉపాధ్యాయూలను కోరారు. ఈ స్కూల్ కి ఎలాంటి అవసరలు ఉన్న మాకు తెలియజేయండి స్థానిక MLA పద్మావతి రెడ్డి ద్రుష్టి కి తీసుకెళ్లి ఎలాంటి సమస్యను ఐన పరిష్కరించడానికి మా వంతుగా కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు పార్టీ నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు