schedule Saturday, June 13, 2026

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

calendar_today September 22, 2024
person meenewstelugu

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

 ---హాజరైన తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పర్మల్

మీ::న్యూస్ ప్రతినిధి తాండూరు పట్టణం లో ని వైట్ ప్యాలెస్ లో జమియతే-ఏ-ఉలేమా ఆధ్వర్యంలో ఉచిత మేగా వైద్యశిబిరం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న ,మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఉచిత వైద్యపరిక్షలు నిర్వహిస్తున్న పలు క్యాబిన్ లను సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్య బృందాలను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ సమయానికి బోజనం చేయాలని వైద్యుల సలహాలు పాటించాలి అపుడ్డే సంపూర్ణ ఆరోగం గా ఉంటామన్నారు.ఉచిత వైద్యశిబిరం నిర్వహించడం పట్ల అభినందనలు తెలిపారు. పట్టణంతో పాటు వివిధ గ్రామాల్లో నుంచి ఉచిత వైద్యశిబిరం పాల్గొన్న ప్రజలు.బిదబడుగు బలహిన వర్గాల కోసం మరింత అబివృద్ది చేస్తామన్నారు, నిర్వాకులు అబ్ధుల్ రహామాన్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఆరోగ్యమే మహాబాగ్యం అన్నారు. ఆరోగంగా ఉంటేనే క్షేమంగా ఉంటామన్నారు.ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ముందుటానని పేర్కొన్నారు. సంవత్సరం పాటు ఉచిత వైద్య శిబిరం పట్టణంలో ని రాయల్ కాంట సమీపంలో ని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జమియాతే -ఎ -ఉలేమా సంఘ సభ్యులు, తాండూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అభిబ్ లాల, రావుఫ్,కమలాకర్, కౌన్సిలర్ ప్రభాకర్ పార్టీ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు