ప్రపంచంలో కాలుష్యం రోజురోజుకు అధికం అయ్యి ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిళ్లుతున్నది అని అట్టి ముప్పు నివారణ భావితరాల శ్రేయస్సు కొరకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుటకు గాను విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ అన్నారు, జూన్ 5 పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట పట్టణంలోని పుల్లారెడ్డి చెరువు ప్రక్కన అమృత్ పధకం ఉమెన్ ఫర్ ట్రీ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మొక్కలునాటేకార్యక్రమంలో పాల్గొని మొక్కలునాటారు, ఈ కార్యక్రమము ద్వారా మహిళ సంఘాల సభ్యులు మొక్కలు పెంచి వాటిని పరిరక్షణ చేయుట ద్వారా ఉపాధి లభిస్తున్నది అన్నారు,అనంతరం పట్టణంలోని పుల్లారెడ్డి చెరువు ప్రక్కన గల సీవరేజ్ ట్రిట్ మెంట్ ప్లాంట్ ను సందర్శించి నీటి శుద్ధి చేయు విధానాన్ని పరిశీలించి ఇంజనీర్ లకు తగు సూచనలు చేశారు.అనంతరం మానసానగర్ రోడ్ నెంబరు-4 లోని పూర్తిచేసిన రోడ్డును పరిశీలించారు.జిల్లాలో అభివృద్ధి పనులకు సంబంధించిన పనులను కాంట్రాక్టర్ లు నాణ్యత తో చేయాలి అని అట్టి పనుల ఫై సంబంధిత అధికారులు ఫీల్డ్ ఫై ఉండి పనులు చేయిచాలి అని,ఫైల్ ప్రాసెసింగ్ నియమ నిబంధనల ప్రకారం ఉండాలి అని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ అన్నారు,సూర్యాపేట పట్టణంలో డీఎం ఎఫ్ టి నిధులతో జరిగిన పనులను పరిశీలించి సంతృప్తి చెందారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపుకలెక్టర్ మరియు మున్సిపల్ ప్రత్యేక అధికారి డాక్టర్ పర్స రాంబాబు,మున్సిపల్ కమీషనర్ బి.శ్రీనివాస్, మున్సిపల్ ఇ.ఇ యం.కిరణ్ ,డి ఇ సత్యారావు ,పబ్లిక్ హెల్త్ డిఇ రమాదేవి,సానిటరీ ఇన్స్పెక్టర్ సారగాండ్లశ్రీనివాస్,ఎ.ఇనరేందర్,రాజారెడ్డి,తిరుమలయ్య,ఎస్.ఎస్ .ఆర్ .ప్రసాద్ టీఎంసీ శ్వేత మహిళసంఘల సభ్యులు తదితరులు పాల్గొన్నారు