ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు

Uncategorized నల్లగొండ రాజాకియం సూర్యాపేట

ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు

మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి

 

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి 12::: మకరరాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ప్రారంభమయ్యే మకర సంక్రాంతి ప్రజల జీవితాల్లో మరిన్ని వెలుగులు నిండి సుఖశాంతులతో జీవించాలని మాజీమంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ప్రజలందరికీ ఆయన భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గత పదేండ్లు KCR పాలనలో తెలంగాణ రాష్ట్రంలో పాడిపంటలతో, ప్రభుత్వ పథకాలతో పండుగలన్నీ ఆనందంగా జరుపుకున్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. మార్పుమార్పు అన్న కాంగ్రెస్ పాలనలో ఏడాది, పండుగలు మారుతున్నాయి తప్ప కొత్తగా ఒరిగిందేమీ లేదన్నారు. ఈ సంక్రాంతి పండుగతో అయినా రేవంత్ పాలనకు కనువిప్పు కలగి అభివృద్ధికి అడుగులుపడాలని కోరుకుందామన్నారు. ప్రజలంతా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య ఈ పండగలను జరుపుకోవాలన్నారు. ప్రధానంగా ఈ పండగ సందర్భంగా పతంగులు ఎగురవేసే ప్రతి ఒకరు జాగ్రత్తలు, నిబంధనలు పాటించాలని సూచించారు.