మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి ని కలిసిన వివోఏలు
మీ న్యూస్ ప్రతినిధి: మోతే మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి వివోఏల సమస్య పరిష్కారం కోసం మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి కి విన్నపించటం జరిగింది
వివరాల్లోకి వెళ్తే:-
మోతే మండల పరిధిలోని వివోఏల కు అతి తక్కువ జీతాలకు పనిచేస్తున్న ఇల్లు గడవని పరిస్థితి మాది ఎక్కువ సమయం పని చేస్తూన్న మాకు ఒక రోజుకు 166/రూపాయలు మాత్రమే వస్తుంది కావునా నాయందు దయ ఉంచి జీతాలను కొంచెం పెంచేవిదంగా మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి ని కలిసి సమస్యలను చెప్పుకోవటం జరిగింది. మీ సమస్యలను ఆలో చించి కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారించే విధంగా చేస్తాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో మోతే మండల వివో ఎ ల అధ్యక్షురాలు కొమ్ము శ్రీలత కార్యదర్శి, దామల్ల గురు స్వామి అంబాల దుర్గయ్య , బత్తెం ముత్తయ్య జయశ్రీ , మహేశ్వరి ,రజిత ,రమణ, పిచ్చమ్మ ,శాంతా లక్ష్మణ్ ఉపేందర్ సుజాత , యమునా లక్ష్మి ,,ఆదినారా యణ,శ్రీను, కృష్ణ, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు