మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ఆర్ సి గౌడ్
తాండూర్ రూరల్ మీ న్యూస్ ప్రతినిధి ::: తాండూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన కటయ్ శాంతమ్మ అనారోగ్యం తో మృతి చెందింది, ఇట్టి విషయాన్ని ఆర్ సి గౌడ్ యువసేన సభ్యుల ద్వారా తెలుసుకున్న తాండూర్ మండల బీ.ఆర్.ఎస్ పార్టీ బీ.సి సెల్ అధ్యక్షుడు ఆర్.సి గౌడ్ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. శాంతమ్మ అంత్యక్రియలకు అందుబాటులో లేకపోవడంతో ఆర్.సీ గౌడ్ యువసేన సభ్యల ద్వారా అంత్యక్రియలకు కోసం ఆర్థిక సహాయంగా 5000/- రూపాయలు పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మల్కాపూర్, యువ నాయకులు, ఆర్.సీ గౌడ్ యువసేన సభ్యులు మృతుని కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.