మీ:న్యూస్ ప్రతినిధి శ్రావణమాసం ముగింపు సందర్భంగా వికారాబాద్ జిల్లా తాండూర్ మండలంలోని గౌతాపూర్ గ్రామంలో మంగళవారం నాడు శ్రీ ఆంజనేయ స్వామి పల్లకి సేవ ఊరేగింపు కార్యక్రమాన్ని గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. శోభయాత్ర దేదీప్యమానంగా విరాజిల్లుతూ, శ్రీ ఆంజనేయ స్వామి పల్లకి సేవ భజనలు, కీర్తనలతో ఊరేగింపు కార్యక్రమాన్ని వాడ వాడలోని ప్రజలు దర్శించుకున్నారు. ఈ శోభ యాత్రలో R. మహేందర్ రెడ్డి, P. బసంత్ రెడ్డి, p. నర్సింహా రెడ్డి, R. మహిపాల్ రెడ్డి, B. రాజు, T. వెంకటేష్, P. శ్రీకాంత్, B.నరేష్, మరియు యువకులు పాల్గొన్నారు.